సర్పంచ్ లకు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోస పెట్టింది : మంత్రి సీతక్క

-

ప్రభుత్వం సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని.. లేదంటే వారి తరపున గొంతు విప్పుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. సర్పంచ్ లకు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోస పెట్టిందన్నారు. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి కేటీఆర్ సర్పంచ్ ల కోసం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సర్పంచ్ లకోసం పోరాడుతానని కేటీఆర్ అనడం.. వెయ్యి పశువులను తిన్న రాబంధు నీతి కథలు చెప్పినట్టు ఉందని సీతక్క కౌంటర్ ఇచ్చారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పెండింగ్ బిల్లులు రాక ఎంతో మంది సర్పంచ్ లు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని ఫైర్ అయ్యారు. ఇంట్లో ఆడవాళ్ల పుస్తెల తాళ్లు అమ్మి మరీ అభివృద్ధి పనులు చేస్తే.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో చేసేదేమి లేక ఎంతో మంది సర్పంచ్ లు సూసైడ్ చేసుకున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని సర్పంచ్ ల ఆత్మహత్యలకు బీఆర్ఎస్ పార్టీనే కారణం అని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news