రైతు రుణమాఫీ పై నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్

-

రైతు రుణ మాఫీలపై నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రైతులందరికీ రుణమాఫీలు కాలేదంటూ ముందు నుంచి విమర్శిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలంటూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40 వేల కోట్ల రుణమాఫీలని, ఇప్పుడు కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమే రుణమాఫీలు చేసారంటూ విమర్శించారు.

40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీలు చేయక ముందే రుణమాఫీ సక్సెస్ అని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ.. అందుకే ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news