హరీష్ రావుపై యాదాద్రి టెంపుల్ ఈవో పోలీసులకు ఫిర్యాదు..!

-

BRS లీడర్ హరీష్ రావు యాదాద్రి టెంపుల్ టూర్ వివాదశపధంగా మారింది. మాడ వీధుల్లో పాప ప్రక్షాళన పూజలపై చర్యలకు సిద్ధమైంది దేవాదాయా శాఖ. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ పైన ఓట్లు వేసి మాట తప్పాడు అని.. రైతులకు అందరికి రుణ మాఫీ చేయలేదని.. అందువల్ల రేవంత్ రెడ్డి చేసిన పంపం తెలంగాణకు తాకకూడదు అనే ఉద్దేశ్యంతో.. తాను రేవంత్ ఓట్లు వేసిన అన్ని దేవాలయాలు తిరిగి పూజలు చేస్తాను అని హరీష్ రావు గతంలో పేర్కొన విషయం తెలిసిందే.

కానీ నిబంధనలకు విరుద్ధంగా పాప ప్రక్షాళన పూజ చేయడంపై అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఆలయ ఈవో భాస్కరరావు నివేదిక పంపారు. అయితే ఉన్నతాధికారుల సూచన మేరకు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు ఆలయ ఈవో భాస్కరరావు. అయితే మాడవీధుల్లో పాప ప్రక్షాళన పూజలు చేయడం ఎండోమెంట్ సెక్షన్ 7 ప్రకారం నేరంగా పరిగణిస్తుంది దేవాదాయశాఖ.

Read more RELATED
Recommended to you

Exit mobile version