పట్నం, దామోదర్ రెడ్డిలపై అనర్హత వేటు వేయండి.. మండలి చైర్మన్‌ను కోరిన బీఆర్ఎస్

-

BRS MLCs: పార్టీ మారిన ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి పైన అనర్హత వేటు వేయాలని కోరుతూ.. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ…బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శాసన మండలి చైర్మన్‌ను కలిశామని చెప్పారు.

BRS MLCs who complained to Legislative Council Chairman Gutta Sukhender Reddy

బీఆర్ఎస్ బీ ఫాం మీద ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్సీలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని చైర్మన్‌కు సాక్ష్యాధారాలతో పిటీషన్ సమర్పించామని వివరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. చైర్మన్ మా పిటిషన్‌పై సానుకూలంగా స్పందించి ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తారని భావిస్తున్నామని వివరించారు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news