ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 6 వరకు ప్యాసింజరు రైళ్ల రద్దు

-

ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 6 వరకు ప్యాసింజరు రైళ్ల రద్దు కానున్నాయి. కాజీపేట నుంచి నడిచే పలు ప్యాసింజర్ రైళ్లను ఆగస్టు 6 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వరదలు, మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా రైళ్ళను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.

డోర్నకల్ పుష్పుల్ రైలు (07753/54), SEC-WGL పుష్ పూల్ (07462/63), రామగిరి ఎక్స్ప్రెస్ (17003/4), బల్లార్షా ఎక్స్ప్రెస్ (17035/36), సింగరేణి ఎక్స్ప్రెస్ (17033/34) రైలును రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, హైదరాబాద్‌ ప్రయాణికులకు అలర్ట్.. 22 MMTS రైళ్లు రద్దు కానున్నాయి. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు 22 MMTS రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే ట్రాక్ ల నిర్వహణ, మరమ్మత్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news