అన్ని రాష్ట్రాలపై కేంద్రానిది ఒకే విధానం – కిషన్ రెడ్డి

-

ఈ నెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో నేడు వరంగల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఎదగాలన్నదే కేంద్రం ఆకాంక్ష అని తెలిపారు.

అన్ని రాష్ట్రాలపై కేంద్రానికి ఒకే విధానమని.. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ఇక ఈనెల 8వ తేదీన కాజీపేటలో వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్, మెగా టెక్స్టైల్ పార్కుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికాలనిప్రజలకు విజ్ఞప్తి చేశారు కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news