ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణకు సహకరించాలి – నామా

-

కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్షాల కంటే కేంద్రం చర్చకు ముందుకు రావాలన్నారు ఖమ్మం టిఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. సభ నుంచి పారిపోయే ప్రయత్నం చేయవద్దన్నారు. తెలంగాణ బడ్జెట్ రైతులు , పేదల బడ్జెట్ అని.. కేంద్ర బడ్జెట్ రైతు వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు. విద్య , వైద్యానికి రాష్ట్ర బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.

దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంటే , తెలంగాణ లో ప్రతి సంవత్సరం వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించకపోయినా , రాష్ట్రం తనకున్న వనరులతో అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందన్నారు నామా నాగేశ్వరరావు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి విషయంలో కేంద్రం అనవసర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కేంద్రం తెలంగాణ కు సహకరించాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news