వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్‌పై టీఎస్‌ నుంచి టీజీకి కేంద్రం ఆమోదం

-

తెలంగాణలో వాహనదారులకు అలర్ట్. వాహనాల రిజిస్ట్రేషన్‌ మార్క్‌ను టీఎస్‌ నుంచి టీజీకి మారుస్తూ కేంద్ర రహదారి రవాణా శాఖ మంగళవారం రోజున గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్‌ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి.. 1989 జూన్‌ 12వ తేదీన అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు వెల్లడించింది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్‌ నంబర్‌ 29ఏ కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇది వరకు ఉన్న టీఎస్‌ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్‌ కేటాయించినట్లు తెలిపింది.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్‌ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు రాష్ట్ర మంత్రి వర్గంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం మార్పు చేస్తూ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇక నుంచి రిజిస్టర్‌ అయ్యే వాహనాల మార్క్‌ టీజీగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news