బీఆర్ఎస్ కి షాక్.. కాంగ్రెస్ లోకి జడ్పీ చైర్మన్

-

ఆదిలాబాద్ జిల్లాలో టిఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలింది. గత పక్షం రోజుల క్రితమే ఆ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ బొజారెడ్డి బీఆర్ఎస్ కి రాజీనామా చేశారు. బుధవారం ఆ పార్టీ ఆదిలాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ తో పాటు జైనథ్ మండల జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి సైతం టిఆర్ఎస్ కి రాజీనామా చేశారు. ఈ మేరకు డిసిసిబి చైర్మన్ రాథోడ్ జనార్ధన్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డిని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రజా భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

దీంతో వీరు కాంగ్రెస్ పార్టీలోనే జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్క ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ కండువా వేసుకొని ఉన్నారు. ఇందుకు నేతలు హైదరాబాదుకు బయలుదేరగా బుధవారం మే పార్టీలో చేరుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ఇతర సంఘాల నేతలు సైతం టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news