నల్గొండ ఆసుపత్రిలో దారుణం..వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే డెలివరీ !

-

నల్గొండ జిల్లా ఆసుపత్రి లో దారుణం చోటు చేసుకుంది.. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే డెలివరి అయింది ఓ మహిళా. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము గ్రామానికి చెందిన నల్లవెల్లి అశ్విని భర్త ఆంజనేయులు. వారు గురువారం రాత్రి నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. అక్కడ డాక్టర్లు లేరని.. నల్గొండ కి తీసుకెళ్ళాలి అని భయబ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి పంపించారు.

అక్కడి నుంచి అంబులెన్స్ లో నల్గొండ జిల్లా ఆసుపత్రికి వస్తె ఇక్కడికి ఎందుకు వచ్చారు.. మూడో కాన్పు కి దేవరకొండ లో చేయించక అని తిట్టారు. ఈ క్రమం లో అశ్విని నీ బయట కుర్చీ లోనే కూర్చోబెట్టారు నర్సులు. పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పినప్పటికీ పట్టించుకోలేదు.. తీవ్ర నొప్పులతో బాధ పడుతూ కుర్చీలోనే డెలివరి అయింది. కుర్చీ కింద తీవ్ర రక్త స్రావం జరిగింది.

 

అప్పుడు అందరూ వచ్చి హడావిడి చేసి తిరిగి పేషెంట్ పేరెంట్స్ నీ తిట్టడం గమనార్హం. ఆ తరువాత లోపలికి తీసుకెళ్ళారు. అక్కడ చూసిన వారందరూ డాక్టర్, నర్సులను తిట్టారు. ఇలాంటి పరిస్థితి మరెవ్వరికీ రాకూడదని బాధితురాలు భర్త ఆంజనేయులు డిమాండ్ చేశారు. డ్యూటీ లో ఉన్న డాక్టర్, నర్సులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news