నేను వేసిన పునాది వల్లనే.. ఆదాయంలో తెలంగాణ మొదటి స్థానం – చంద్రబాబు

-

 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు నేను వేసిన పునాది వల్లనే ఈ రోజు తెలంగాణ తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో ఉందని వెల్లడంచారు. దానికి నేను గర్వపడుతున్నానని చెప్పారు. ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్-1 స్థానంలో ఉండడానికి విజన్-2047 పెట్టుకున్న.. దానికోసమే పని చేస్తున్నానని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

హైదరాబాద్‌ లోని ఎన్టీఆర్‌ భవన్‌ లో చంద్రబాబు మాట్లాడుతూ… కొన్ని ప్రత్యేకమైన పరిస్థితిలో ఇక్కడ అధ్యక్షున్ని పెట్టలేదు..ఇక్కడ గత రెండు ఎన్నికలకి దూరంగా ఉన్నామన్నారు. ఊహా జనిత ప్రశ్నలకు సమాధానం చెప్పాను..పార్టీ ని ఎలా బలోపేతం చేయాలని, ప్రజలకు ఎలా సేవలు అందించాలి అనేది ఆలోచిస్తున్నామన్నారు.. తెలుగు ప్రజల కోసం నిరంతరం పని చేసిన పార్టీ టీడీపీ అని… ఆంధ్రపదేశ్ లో వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని వెల్లడించారు. దానిని దారిలోకి తెచ్చుకోవాలని తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను..తెలుగు ప్రజల మనోభావాల కోసం పని చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news