BREAKING : కేసీఆర్‍ ను పరామర్శించనున్న చంద్రబాబు

-

తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. కాలు జారి కింద పడటంతో.. కేసీఆర్‌ ను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే కేసీఆర్‌ కు తుంటి సర్జరీ చేశారు యశోద వైద్యులు.

chandrababu to yashoda hospital

ఈ తరుణంలోనే.. ఆస్పత్రిలో ఉన్న కేసీఆర్‌ ను పరామర్శించేందుకు చాలా మంది వస్తున్నారు. ఇక ఇవాళ కేసీఆర్‌ ను పరామర్శించనున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఉదయం 10 గంటలకు కేసీఆర్ ను పరామర్శించనున్నారు నారా చంద్ర బాబు నాయుడు.

ఇక అటు తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకుని అసెంబ్లీలో అడుగుపెట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. యశోదా ఆసుపత్రిలో మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను సీఎం రేవంత్ తో పాటు, మంత్రులు పరామర్శించారు. పదిహేను నిమిషాల పాటు కేసీఆర్, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news