ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాశం యాదగిరికి మధ్య గొడవ

-

ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, పాశం యాదగిరికి మధ్య గొడవ చోటు చేసుకుంది. మహేష్ గౌడ్ చేతి నుంచి మైక్ లాక్కున్న పాశం యాదగిరి..నాన రచ్చ చేశారు. ఓ పాట ఆవిష్కరణ సభలో ఈ గొడవ జరిగింది. రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయం అయితుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పాశం యాదగిరి.

Clash between Congress MLC Mahesh Goud and senior journalist Pasam Yadagiri

తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకొని దశాబ్ది ఉత్సవాలు ఎలా చేస్తారు.. తెలంగాణ ఐక్య వేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం అంటూ పాశం యాదగిరి పిలుపునిచ్చారు. జూన్ 2న జరిగే సన్మానానికి ఎవరూ వెళ్లొద్దని చెప్పిన పాశం యాదగిరి… రేపు చంద్రబాబు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారేమో అని మాకు భయం అయితుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news