మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటన షెడ్యూల్ ఇదే

-

మహారాష్ట్రలో రెండ్రోజుల పర్యటనకు సోమవారం రోజున హైదరాబాద్ నుంచి బయల్దేరిన సీఎం కేసీఆర్ సాయంత్రానికి సోలాపూర్​ చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్​కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సోలాపూర్ నేత భగీరథ బాల్కే.. ఇతరులు బీఆర్ఎస్​లో చేరారు. స్థానిక నేతలు, తెలంగాణ నుంచి వలస వెళ్లిన చేనేత కుటుంబాలు కేసీఆర్​ను కలిశారు. అనంతరం రాత్రి అక్కడే బస చేశారు.

ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ పండరీపురం వెళ్తారు. అక్కడ శ్రీ విట్టల్ రుక్మిణి దేవస్థానాన్ని సందర్శించి పూజా కార్యక్రమాలలో పాల్గొంటారు. విఠలేశ్వరునికి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడ నుంచి సర్కోలి వెళ్తారు. అక్కడ భారాస సభలో కేసీఆర్ పాల్గొంటారు. సోలాపూర్ జిల్లాకు చెందిన భగీరథ్ బాల్కే సహా పలువురు ఇతరులు భారాసలో చేరతారు. అనంతరం సీఎం కేసీఆర్, నేతలు తుల్జాపూర్ వెళ్తారు. అక్కాడ్ తుల్జా భవాని అమ్మవారి దేవస్థానానికి చేరుకొని పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు.

Read more RELATED
Recommended to you

Latest news