BREAKING : నేడు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం

-

ఇవాల్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఇక ఇవాళ ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. మొదట జీరో అవర్ జరుగనుంది. అనంతరం కాగ్ రిపోర్టును సభలో ప్రవేశ పెట్టనున్నారు మంత్రి హరీష్ రావు.

అలాగే.. మరో ఐదు ప్రభుత్వ బిల్లులు కూడా కేసీఆర్‌ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుంది. అనంతరం 9 ఏళ్ల తెలంగాణలో అభివృద్ధి పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. అటు ఇవాళ 11.30 గంటలకు అసెంబ్లీకి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం.. తెలంగాణ అభివృద్ధిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో సమాధానం ఇవ్వనున్నారు సీఎం కేసీఆర్. దాదాపు 2 గంటల పాటు.. సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news