సీఎం రేవంత్ రెడ్డిదే అసలైన కుటుంబ పాలన.. మన్నె క్రిషాంక్ సంచలన వ్యాఖ్యలు

-

సీఎం రేవంత్ రెడ్డిదే అసలైన కుటుంబ పాలన అని.. రేవంత్ పాలనలో దండు పాళ్యం ముఠా చెల రేగుతుందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. వెయ్యి కోట్లతో స్వచ్ఛ బయోప్లాంట్ అని  చాలా పత్రికల్లో వార్త వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు బోగస్ కంపెనీలు, ప్రాడ్ కంపెనీలే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఒక కుటుంబ కంపెనీ వచ్చిందని బాంబ్ పేల్చారు.

ఉద్యమంలో కొట్లాడి రికార్డు స్థాయిలో ఓట్లు తెచ్చుకున్న హరీశ్ రావు, కేటీఆర్, కవిత గార్లను కుటుంబ పాలన అని కాంగ్రెస్ నేతలు అటాక్ చేశారు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ కనబడని..ఇప్పటివరకు ఎన్నికల్లో పాల్గొనని ఒక దండుపాళ్యం బ్యాచ్  అసలైన కుటుంబ దోపిడీ పాలన చేస్తుందని విమర్శించారు. ఒక బ్యాచ్ ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్న జగదీశ్ ఎనుముల అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నీకు సీఎం పదవీ వచ్చింది నీ తమ్ముడి కంపెనీతో వ్యాపారం చేయించడానికేనా..? తమ్ముడి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడానికి రేవంత్ రెడ్డి అమెరికా దాకా వెళ్లాలా..? అని ప్రశ్నించారు. స్వచ్ఛ బయో ఒప్పందం మీద కాంగ్రెస్ నాయకులు స్పందించాలని డిమాండ్ చేశారు మన్నె క్రిషాంక్.

Read more RELATED
Recommended to you

Latest news