CM Revanth Reddy: మంచి మనసు చాటుకున్న సీఎం రేవంత్ కూతురు!

-

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు నైమిశా రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ చూడాలనే అనాధల కోరికను ఆమె నెరవేర్చారు. ఎల్బీనగర్ లోని అనాధాశ్రమానికి చెందిన 30 మంది పిల్లలను స్టేడియంకు తీసుకెళ్లారట.

CM రేవంత్ కూతురు నైమిషా రెడ్డి గొప్ప మనసు.. IPL మ్యాచ్‌కు ఆ 30 మంది

నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన హైదరాబాద్ వర్సెస్ సూపర్ జెంట్స్ మ్యాచ్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూతురు నైమిశా రెడ్డి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో నిన్న ఉప్పల్ స్టేడియంలో ఆ పిల్లలు ఎంతో ఎంజాయ్ చేశారట. ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది.

కాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు ఊచ కోత కోశారు. వరి కోసినట్లే సిక్స్ లో వర్షాన్ని కురిపించారు. దీంతో లక్నో సూపర్ జెంట్స్ జట్టుపై 10 ఓవర్లలో మ్యాచ్ విజయాన్ని దక్కించుకుంది హైదరాబాద్. మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెంట్స్ 166 పరుగులు చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే చేదించింది హైదరాబాద్ జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news