కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం అన్ని ఒక్కటే : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలే అని కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బీసీ ఆత్మ గౌరవ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ తో గతంలో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. ఎంఐఎంతో కూడా గతంలో కాంగ్రెస్ పొత్తుపెట్టుకుంది. కాబట్టి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీ ఒక్కటేనని తెలిపారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కి అమ్ముడుపోయారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనన్నారు కిషన్ రెడ్డి.

తెలంగాణలో మార్పు బీజేపీ ద్వారానే సాధ్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని.. తెలంగాణ ను అభివృద్ది చెందలేదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు అన్నారు. బీసీలు ఎదగాలనే ఉద్దేశంతో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలారా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి అని కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news