తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది.. విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పై ఇప్పటికే పలుమార్లు బీఆర్ఎస్ నేతలు కలిపోతుందని విమర్శలు చేశారు. తాజాగా ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. త్వరలోనే కూలిపోతుందన్నారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రాజ్యసభలో రాష్ట్రపతి స్పీచ్  చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ముఖ్యంగా ఏపీ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదన్నారు. 2004లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. పదేళ్ల తరువాత చిట్టచివరిలో అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికల నోటిఫికేషన్ పది రోజుల ముందు రాష్ట్రాన్ని విభజించారు. ఎన్నికల్లో లాభం పొందాలనే ఉద్దేశంతో ఇలా చేశారు.  ఏపీపై కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news