కోమటిరెడ్డిపై ఫైర్ అయిన కాసేపటికే.. ప్రగతి భవన్ కు కాంగ్రెస్ కీలక నేత

-

భువనగిరి జిల్లా కాంగ్రెస్ లో ముసలం మొదలైంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఫైర్ అయిన ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. కోమటిరెడ్డి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని.. మనస్తాపానికి గురైన ఆయన సమావేశం అనంతరం .. ప్రగతి భవన్‌కు వెళ్లారు. అక్కడ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో అనిల్‌ కుమార్‌ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

భువనగిరి నియోజకవర్గంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి చేస్తుంది తప్పని కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కాంగ్రెస్‌ నుంచి ఇప్పటికిప్పుడు తాను పార్టీ మారనని.. ఎంపీ కోమటిరెడ్డి అంశాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని చేశారు. కాంగ్రెస్‌ పెద్దల స్పందనను బట్టి.. తన నిర్ణయం ఆలోచిస్తానని చెప్పారు. కానీ.. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే అనిల్‌ కుమార్‌ రెడ్డి ప్రగతిభవన్‌ మెట్లు ఎక్కడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news