రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేతల నివాళి

-

నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 జయంతి. ఈ సందర్భంగా లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు ఒడ్డున తన తండ్రికి నివాళులర్పించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు.

ఇక హైదరాబాద్ లోని సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే , వి హనుమంతరావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీలను బలోపేతం చేసింది రాజీవ్ గాంధీనే అని తెలిపారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని బిజెపి అవలంబిస్తుందని.. మణిపూర్ మండుతున్నా అక్కడి ప్రజలకు ప్రధాని భరోసా ఇవ్వడం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news