పెళ్ళైన ఏడాదికే భార్యను చంపేసిన కాంగ్రెస్ నేత కుమారుడు..!

-

తెలంగాణ రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్ళైన ఏడాదికే భార్యను కాంగ్రెస్ నేత కుమారుడు చంపేశాడు. అంతేకాదు..ఆ హత్యను గుండెపోటుగా చిత్రీకరించి తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన కాంగ్రెస్ నేత ఎడవెల్లి రంగసాయి రెడ్డి కుమారుడు వల్లభ రెడ్డి నిర్వాకం తాజాగా బయటపడింది.

పోస్ట్ మార్టం నివేదిక తో అసలు విషయం బయటపడింది. వల్లభ రెడ్డి భార్యను తీవ్రంగా కొట్టి చంపినట్లుగా పోస్ట్ మార్టం నివేదిక లో వెలుగులోకి వచ్చింది. వల్లభ రెడ్డి భార్యకు తీవ్ర గాయాలైనట్లు గుర్తించారు వైద్యులు. ఇక ఈ విషయం బయటపడటంతో… వల్లభ రెడ్డిని అరెస్ట్ చేసి రిమండ్ కు పంపారు నారాయణగూడ పోలీసులు. హత్య, సాక్షాలు చెరిపేసినట్లుగా నిర్దారించి సెక్షన్‌ 201, 302 కేసులు నమోదు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news