వేముల వీరేశం అరాచకాలు..యువకుడు ఆత్మహత్యయత్నం !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అరాచకాలు బయటపడుతున్నాయి. పట్టా భూములను కబ్జా చేస్తున్నారట వేముల వీరేశం అనుచరులు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం కూడా చేసుకున్నాడు.

Congress MLA Vemula Veeresham is anarchist

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పట్టణానికి చెందిన జింకల కార్తీక్ అనే వ్యక్తి భూమిని అక్రమంగా వేముల వీరేశం అనుచరులు వేముల సత్తయ్య, వేముల నరసింహ అధికారాన్ని అడ్డుపెట్టుకొని తనని కొట్టి హింసకు గురి చేసి భూమిలో కడ్డీలు పాతుతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేసిన తనను పొట్టించుకోవడం లేదని.. ఇంకా తనకు న్యాయం జరగదని పత్తి చేనుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు జింకల కార్తీక్.

ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న జింకల కార్తీక్… నా చావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం కారణం అంటూ వీడియో విడుదల చేశాడు. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు తన భూమిని కబ్జా చేస్తున్నారని.. పొలంలోనే పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్యాయత్నం చేశాడు. నార్కెట్‌పల్లి కామినేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు యువకుడు జింకల కార్తీక్.

Read more RELATED
Recommended to you

Latest news