ఎల్బీనగర్ కార్యకర్తల సమావేశంలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు !

-

Congress LB Nagar : ఎల్బీనగర్ కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సమక్షంలో తన్నుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

Congress workers who were beaten in the meeting of LB Nagar workers

లింగోజిగూడ డివిజన్, చంపాపేట్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో.. లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సునీత మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ స్టేజిపై ఉండగానే రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. గొడవ సద్దుమనగకపోవడంతో సమావేశం మధ్యలో నుంచి సునీత మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news