సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్లు : కీలక సూత్రధారిగా సుబ్బారావు గుర్తింపు

-

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అటాక్ వెనక కుట్రకోణం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్రణాలికతోనే విధ్వంసం సృష్టించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అభ్యర్థులను డిఫెన్స్ కోచింగ్ సెంటర్లు..రెచ్చగొట్టినట్లు తెలుస్తోంది. నర్సారావు పేటకు చెందిన సుబ్బారావు కీలక సూత్రధారి గా గుర్తించారు పోలీసులు.

ప్రైవేటు అకాడమీల సహకారం తోనే విద్వంసానికి పాల్పడ్డ విద్యార్థులు.. అకాడమీల్లోనే కొంతమంది నిరసనకారులు షల్టర్ ఇచ్చినట్లు తేల్చారు పోలీసులు. సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ కి వచ్చినట్లు తేల్చారు పోలీసులు.

ఫ్రైడే నైట్ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో సెల్పీ దిగి పోస్ట్‌ చేసిన సుబ్బారావు.. విద్యార్థులకు వాటర్ బాటిల్ లు, బటర్ మిల్క్, పులిహోర ప్యాకెట్లు సప్లై చేశాయి ప్రైవేటు ఆర్మి కోచింగ్ అకాడమీలు. పది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిరసనకారులు పాల్గొన్నట్లు తేల్చారు పోలీసులు. మూడు రోజుల క్రితం ఆర్మి పరీక్ష క్యాన్సిల్ అయిదంటూ యూట్యూబ్ లో వీడియోలు కూడా బయటపడ్వాయి. విద్యార్థులను రెచ్చగొట్టిన సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుక సుబ్బారావు గా గుర్తించారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news