BREAKING :నేడు సాయంత్రం సీఎం కేసీఆర్‌ ప్రెస్‌మీట్..!

-

దేశానికి సేవలు అందించాలనే ఆసక్తిగల యువతను త్రివిధ దళాల్లో నియమించేందుకు కేంద్రం తాజాగా అగ్నీపధ్ పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకానికి తానుకూల స్పందన రావడం మాట అటుంచితే.. యువత, ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేవలం నాలుగేళ్లు సైనిక సర్వీసులో ఉంచి ఆ తరువాత ఇంటికి పంపిస్తే తమ భవిష్యత్తు ఏంటి? అని ప్రస్తుతం ఆర్మీ పరీక్షలకు సిద్ధం అవుతున్న చాలా మంది అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో బీహార్లోని ఆర్జెడి ఆధ్వర్యంలో ప్రతిపక్ష పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నేడు( శనివారం) సాయంత్రం మీడియా సమావేశం ద్వారా అగ్నిపధ్ కు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news