తెలంగాణలో మరోసారి భారీగా కరోనా, పెరుగుతున్న మరణాలు…!

-

తెలంగాణాలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో తెలంగాణా వ్యాప్తంగా భారీగానే కేసులు నమోదు అయ్యాయి అని రాష్ట్ర ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. తెలంగాణాలో గత 24 గంటల్లో 1724 కరోనా కేసులు నమోదు అయ్యాయి అని, 10 మంది కరోనా సోకి మృత్యువాత పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 729 మంది ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకి ప్రాణాలు విడిచారు అని తెలిపింది.

రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 21509 గా ఉన్నాయి. మొత్తం కేసులు 97 వేల 424 కి చేరుకున్నాయి. మొత్తం కరోనా నుంచి 75186 మంది కోలుకున్నారు అని తెలిపింది. గత 24 గంటల్లో 1195 మంది వరకు కరోనా నుంచి విముక్తి పొందారు అని పేర్కొంది. 8 లక్షల 21 వేల పరీక్షలను రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహించింది అని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news