ఒకప్పటి కార్పొరేటర్ నేడు సెంట్రల్ మినిస్టర్..!

-

భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే కేంద్ర మంత్రుల బెర్తులు కన్ఫామ్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి ఇద్దరికి చోటు దక్కనుంది. బీజేపీ ఎంపీలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం లభించనుంది.

ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు అవకాశం కల్పించనున్నారు. కరీంనగర్‌ నుంచి బండి సంజయ్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. కరీంనగర్ కార్పొరేటర్ గా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బండి సంజయ్ ఆ తర్వాత ఎంపీగా గెలిచారు. అనంతరం తెలంగాణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో పార్టీని రాష్ట్రంలోనే బలోపేతంగా తయారు చేశారు. ఇక ఈ ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించి ఇప్పుడు కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news