భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్‌ను ప్రకటించిన సీపీఎం

-

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఖరారు అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఇలాంటి నేపథ్యంలో అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి నుంచి పోటీ చేయాలని సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు.. భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ను ప్రకటించింది సీపీఎం.
కాగా, అభ్యర్థి ఎంపికతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మిగతా పార్లమెంటు స్థానాలలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని అంశంపై పోలిట్ బ్యూరో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news