హైదరాబాద్ లో విషాదం…ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్యాయత్నం !

-

హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది…ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్.ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదండరాం నగర్లో ఈ విషాద ఘటన జరిగింది.

వారణాసిలో ఏపీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్య !

హైదరాబాద్ లోని కోదండరాం నగర్లో నివాసం ఉంటున్న కుటుంబం వి.వెంకటేశ్వర ప్రసాద్, భార్య లత, ముగ్గురు కుమారులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబంలోని ఐదుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు ఒడిగట్టారని సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న సరూర్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కుటుంబం మొత్తాన్ని వైద్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news