కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేవరకు కృషి చేస్తా: దాసోజు

-

తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు భారత రాష్ట్ర సమితి నేత, ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిన్న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేసీఆర్ కేబినెట్.

అయితే ఇందులో భాగంగానే దాసోజు శ్రవణ్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారు. అయితే ఈ అవకాశం కల్పించిన విషయంపై దాసుడు శ్రావణ్ స్పందించారు. పితృ సమానులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై నమ్మకంతో మరియు ఆప్యాయతతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేశారు… టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అలాగే సీఎం కేసీఆర్ను ముఖ్యమంత్రిగా మరోసారి చేసేందుకు తాను కష్టపడతానని స్పష్టం చేశారు దాసోజు శ్రవణ్.

Read more RELATED
Recommended to you

Latest news