అంబర్‌ పేటలో విషాదం..మందలించాడని తండ్రిని చంపిన కూతురు

-

హైదరాబాద్‌ లోని అంబర్‌ పేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మందలించాడని తండ్రి గొంతు కోసి చంపింది ఓ కూతురు. ఈ సంఘటన నిన్న అర్ధరాత్రి అంబర్ పేట తులసి రామ్ నగర్ లో జరిగింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. తండ్రి మందలించాడని కోపంతో గాజు వక్కతో..అతని గొంతు కోసింది నిఖిత అనే కూతురు.

దీంతో తీవ్రంగా గాయపడ్డ తండ్రి జగదీశ్వర్ ను ఉస్మానిక తరలించారు స్థానికులు. అయితే.. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తండ్రి జగదీశ్వర్ మృతి చెందాడు. అఫ్జల్ గంజ్‌ లో ఓ దుకాణంలో పని చేస్తోంది నిఖిత. ప్రతిరోజు రాత్రి లేటుగా వస్తున్నామని పలుమార్లు నిఖిత ను హెచ్చరించాడు ఆమె తండ్రి. ఈ తరుణంలోనే… తండ్రిని చంపేసింది నిఖిత. ఇక ప్ర స్తుతం పోలీసుల అదుపులో కూతురు నిఖిత ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నారు అంబర్ పేట్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news