ఇవాళ రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ ఉద్యోగుల నిర్ణయం

-

ఇవాళ రాజ్ భవన్ ముట్టడికి ఆర్టీసీ ఉద్యోగుల నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే TSRTC కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును గవర్నర్‌ తమిళిసై తిరస్కరించారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు బంద్‌ కు పిలుపుఇచ్చారు.

దీంతో నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్‌ అయ్యాయి. ఇవాళ ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు. అంతేకాదు రాజ్ భవన్ ముట్టడికి పిలుపు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ…ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఆర్టీసీ కార్మికులు.

Read more RELATED
Recommended to you

Latest news