యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు..!

-

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి కాలం ముగిసిపోయేందుకు ఎండలు, మరోవైపు మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఉండటం, వీక్ ఎండ్ ఉండటంతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువ అయింది. ముఖ్యంగా క్యూలైన్ లో భక్తులు బారులు తీరారు.

స్వామి వారి ఉచిత దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలకు సమయం పడుతోంది. కొండపైన వాహనాలతో కిటకిటలాడుతున్నాయి పార్కింగ్ స్థలాలు. వెహికల్ పార్కింగ్ లేకపోవడంతో కొండ పైకి వెళ్లే వాహనాలు.. కొండ కిందనే గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news