రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు.. దావోస్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి

-

నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులను రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. అత్యుత్తమ వైద్య సేవలకు, సాప్ట్ వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని. అయితే నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నది.

ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలందించాలనేదే నా లక్ష్యం. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద పేదలకు రూ.10లక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్తుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్యసేవలు అందిస్తాం. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతాం. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషదాల్లో 33 శాతం హైదరాబాద్ లోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు ఒక్కరోజులోనే తెలంగాణకు రూ.37,870 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news