తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది – మాణిక్ రావ్ ఠాక్రే

-

తెలంగాణలో ఎన్నికల వాతావరణం వచ్చేసిందన్నారు ఏఐసీసీ ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే. నాయకులు క్షేత్ర స్థాయిలో గట్టిగా పని చేయాలని సూచించారు. రాబోయేది మన ప్రభుత్వమే.. మనం కష్టపడితే అధికారం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ రోజు ప్రజలకు అబద్ధాలు చెబుతూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనకు పేపర్, చానల్స్ ఉన్నాయి.. తను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్టు, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

రోజు ఒక వర్గానికి ఏవో ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని.. ఇవన్నీ పచ్చి అబద్దాలు.. వాటిని మీరు అవగాహన చేసుకొని వాస్తవాలను జనంలోకి తీస్కొని పోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలకు అర్థం అయ్యే విదంగా, గట్టిగా వాస్తవాలను ప్రచారం చెయ్యాలన్నారు. జనంలోనే ఉండాలి.. వాళ్లకు కేసీఆర్ చెప్తున్న అబద్దాలు వివరించాలన్నారు. మనం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో కూడా వివరించాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news