వైఎస్‌ షర్మిలకు షాక్‌..బీజేపీలోకి ఎపూరి సోమన్న ?

-

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిలకు ఊహించని షాక్‌ తగులనుంది. త్వరలోనే బీజేపీలోకి ఎపూరి సోమన్న వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ఎపూరి సోమన్న…. బీజేపీ పార్టీ లో చేరుతారని అంటున్నాయి బీజేపీ వర్గాలు.

వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలోకి వెళతారని.. తన పార్టీని విలీనం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో బీజేపీలోకి ఎపూరి సోమన్న వెళ్లేందుకు సిద్ధం అయ్యారట. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇది ఇలా ఉండగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులం అందరం కాంగ్రెస్ పార్టీని క్షమించాలి అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. నిన్న మీడియాతో ఆమె పలు ఆసక్తికర వ్యాక్యలు చేశారు. మన మధ్య నుంచి వెళ్ళిపోయిన కోట్ల మంది గుండెల్లో ఉన్నారు అని తెలిపారు షర్మిల. ఆయన అందించిన పథకాలు ఇంకా ఆయన్ని ప్రజల్లో ఉంచాయి. రైతులకు పెట్టుబడిని తగ్గించి.. రాబడి పెంచేలా చర్యలు తీసుకున్నారు..మహిళలకు రుణాలు ఇచ్చారు.. పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్మెంట్స్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news