ఖమ్మంలో సీట్లు రాకున్నా 80 సీట్లు గెలుస్తాం. మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

-

ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో 90 సీట్లను దాటుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు తెల్లం వెంకట్ రావు అతని అనుచరులతో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ల సమక్షంలో  బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ వ్యక్తిగత ఇష్టా ఇష్టాలను వదిలి వేయాలి …పార్టీ అభ్యర్థి గెలుపు కోసం అందరం పని చేయాలి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా లో సీట్లు రాకున్నా 80 సీట్లు గెలుస్తాం అని సంచలన వ్యాఖ్యలు చేశాడు మంత్రి అజయ్.

ఖమ్మం జిల్లాలో సీట్లు గెలిస్తే BRS సంఖ్య 90 దాటుతుంది అని పేర్కొన్నారు. రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే BRS కు వచ్చింది. మళ్ళీ కేసీఅర్ ను అధికారంలోకి తీసుకురావడం లో ఖమ్మం జిల్లా ప్రజలు ప్రధాన పాత్ర పోషించాలని పేర్కొన్నారు. అదేవిధంగా కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసే వారు మూల్యం చెల్లించుకోక తప్పదని పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version