టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

-

తెలంగాణలో సీనియర్ రాజకీయ నేత.. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా క్యాన్సర్​తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కొంత కాలం క్రితం దయాకర్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స తీసుకుని.. కాస్త కోలుకున్న తర్వాత మహబూబ్​నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలంలోని తన స్వగ్రామమైన పర్కపురం వెళ్లారు. అయితే ఇటీవల మళ్లీ ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ఇవాళ కన్నుమూశారు.

కొత్తకోట దయాకర్ రెడ్డి టీడీపీ నుంచి 1994,1999లో అమరచింత నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో మక్తల్ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దయాకర్ రెడ్డి భార్య సీత కూడా టీడీపీ నుంచి 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దయాకర్ మరణంపై సీఎం కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలంగాణ నేతలు, ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news