Telangana: రుణమాఫీ కాలేదని అగ్రికల్చరల్ ఆఫీసులో రైతు ఆత్మహత్య !

-

తెలంగాణ రాష్ట్రంలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ కాలేదని ఏకంగా అగ్రికల్చర్ ఆఫీసులోనే రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి అనే రైతు రుణమాఫీ కాలేదని గత కొన్ని రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారట. అయినప్పటికీ ఆయన సమస్య పరిష్కారం కాలేదని సమాచారం.

అగ్రికల్చర్ ఆఫీసర్లు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు తప్ప రుణమాఫీ చేయడం లేదని గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడట సురేందర్ రెడ్డి. దీంతో రుణమాఫీ కాలేదని అగ్రికల్చర్ ఆఫీసులోనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం అగ్రికల్చర్ కార్యాలయం ఆవరణలోనే చెట్టుకు ఉరేసుకొని మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news