రేపు ధర్నా చౌక్ లో రైతు దీక్ష.. బీజేఎల్పీ నేత ఏలేశ్వర్ రెడ్డి ప్రకటన

-

బీజేపీ ఆధ్వర్యంలో రైతుల హామీల సాధన దీక్ష చేయబోతున్నట్టు బీజేఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని.. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 30న ఉదయం నుంచి అక్టోబర్ 1వ తేదీ  ఉదయం వరకు హైదరాబాదులోని ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రైతు హామీల సాధన దీక్ష చేయనున్నట్టు తెలిపారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలవాలని.. రైతు దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news