వివాదంగా రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య..హరీష్ రావుపై కాంగ్రెస్ ఫిర్యాదు !

-

రుణమాఫీ కాకపోవడం వల్లే మేడ్చల్ జిల్లా వ్యవసాయ కార్యాలయంలో రైతు సురేందర్ రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని బిఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు.

మాఫీకి రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్లే రైతు సురేందర్ రెడ్డి ప్రాణాలు కోల్పోయాడని.. ఈ విషయాన్ని బాధితుడు స్వయంగా తన బ్యాంక్ పాస్ బుక్ పై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడని అన్నారు హరీష్ రావు. అయితే హరీష్ రావు మాట్లాడిన తీరు రైతులను రెచ్చగొట్టే విధంగా ఉందని, రైతు ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.

దీంతో హరీష్ రావు పై క్రిమినల్ కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. రుణమాఫీ ప్రక్రియ ఇంకా పూర్తి కాకుండా రైతులను రెచ్చగొట్టే విధంగా ప్రజలలోకి ప్రభుత్వం పై తప్పుడు సంకేతాలు వెళ్లేలా హరీష్ రావు మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news