BREAKING : నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

-

నల్గొండ జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మాతాశిశు ఆరోగ్య కేంద్రం స్టోర్ రూంలో షాక్ సర్క్యూట్​తో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది.

స్టోర్ రూమ్​లో చెలరేగిన మంటలు ఇతర వార్డులకు వెంట వెంటనే వ్యాపించాయి. స్టోర్​ రూమ్​లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండటంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పొగలు వ్యాపించడంతో వార్డుల్లో ఉన్న రోగులు ఇబ్బందులు పడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చిన్నారులతో సహా తల్లులు బయటకు పరుగులు తీశారు.

పొగ దట్టంగా అలుముకోవడంతో సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే పొగ బయటకు పోయేలా కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలు పూర్తిగా ఆర్పిన తర్వాత.. షార్ట్ సర్క్యూట్ వల్లే ఘటన చోటుచేసుకుందని తెలిపారు.

​మరోవైపు దట్టమైన పొగ వల్ల చిన్నారులు ఊపిరి పీల్చుకునేందుకు కష్టమవుతోందని తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగ వల్ల గొంతులో మంట పుడుతోందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news