హైదరాబాద్ గాజుల రామారంలో అగ్ని ప్రమాదం

-

గాజుల రామారం లోని ప్లైవుడ్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీప భవనాల్లోకి భారీగా పొగ వ్యాపించడంతో ప్రజలు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు.

అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకొని ప్రమాదాన్ని అరికట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు నిత్యం ఎక్కడో ఒక చోట చోటు చేసుకోవడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news