నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా?

-

నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా కానుంది. అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల తొలి జాబితా నేడు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కసరత్తు పూర్తిచేసి తొలి జాబితా రూపొందించినట్లు సమాచారం. ఎన్నికల్లో బీసీలకు, మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు బిజెపి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆ పార్టీ ఎంపీలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ ఈ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపించారనే వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా.. తెలంగాణలో జనసేనకు బీజేపీ 12 సీ ట్లు కేటాయించింది. వైరా, మధిర, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలేరు, సత్తుపల్లి, యెల్లందు, కూకట్‌పల్లి, నక్రేకల్‌, కోదాడ, పాలకుర్తిలను జనసేనకు కేటాయించారు. అటు గజ్వేల్, హుజూరాబాద్ లో పోటీ చేయనున్నారు ఈటల రాజేందర్. ఈ మేరకు బిజెపి ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news