కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలి !

-

కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి… అనంతరం మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు ఉన్న రోజులు పునరావృతం అవుతున్నాయని చెప్పారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

Former minister Jagadish Reddy inspected the drinking water tank where the monkeys had died

కోతులు చనిపోయిన వాటర్ ట్యాంక్ నీరు తాగిన వారందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రజలను,పాలనను గాలికి వదిలేసింది.. సాగు,తాగు నీటి సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందన్నారు. నాగార్జునసాగర్‌ను మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అని వెల్లడించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news