బీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

-

సీఎం కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే జనగామకు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ తీర్థం స్వీకరించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతుగా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొన్నాల లక్ష్మయ్య మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, వర్గాల అభ్యున్నత అభివృద్ధి సాధన కోసం మరింత ప్రోత్సాహకాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లడం అతిశయోక్తి కాదు అన్నారు. 

ప్రస్తుతం రాజకీయ పార్టీలు రకరకాలుగా ఉన్నాయని.. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు.. ఎన్నికల తరువాత  రాజకీయ పార్టీలు వేరు అన్నారు. అయితే  ఈ దేశానికి, రాష్ట్రానికి స్పూర్తి  దాయకం బీఆర్ఎస్ అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు, మూడు నెలల్లోనే బీఆర్ఎస్  కులగణన మీద ముందుకు తీసుకొచ్చిందని తెలిపారు. బలహీన వర్గాలను అణచివేస్తూ.. మోసం చేస్తూ అధికారం సంపాదించుకోవడం పలు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా తాను 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. కాంగ్రెస్ పార్టీ అవమానించిందని పేర్కొన్నారు.  ముచ్చటగా  మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడాలి. జనగామ నియోజకవర్గంలో డైరీ డెవలప్ మెంట్ అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్ ని కోరారు పొన్నాల లక్ష్మయ్య.

Read more RELATED
Recommended to you

Latest news