బాయిలర్ కోళ్ల లా పెంచితే కాంగ్రెస్ కి ఓటు వేశారు.. మాజీ ఎమ్మెల్యే కాంతారావు

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం 39 సీట్లు మాత్రమే సాధించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం పై వ్యతిరేకతతో ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి పట్టాన్ని కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక మార్పులు చేస్తున్నారు. ప్రతీ విషయంలో క్షుణ్నంగా పరిశీలించి.. మార్పులు, చేర్పులు చేపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా పినపాక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు కార్యకర్తలను బాయిలర్ కోళ్ల మాదిరిగా పెంచితే కాంగ్రెస్ కు ఓటు వేశారని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ను అసలు జనాలు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలు  ప్రజల్లోకి వెళ్లారు. హైదరాబాద్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారు. గ్రామీణ ప్రజలు అభివృద్ధికి నోచుకోలేదు. వారందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అని కార్యకర్తల సమావేశంలో పేర్కొన్నారు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

Read more RELATED
Recommended to you

Latest news