ప్రభుత పాఠశాలలు, కళశాలలకూ ఉచిత విద్యుత్

-

ప్రభుత పాఠశాలలు, కళశాలలకూ ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది కాంగ్రెస్‌ సర్కార్‌. ఈ మేరకు సీఎం రేవంత్‌ అధికారిక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది.

Free electricity to government schools and colleges

ఉద్యోగులకు రావాల్సిన PRC, పెండింగ్ డీఏలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యలను సంఘాల నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎంను కలిసే అవకాశం రాలేదని, కానీ రేవంత్ రెడ్డి తమను సంప్రదించారంటూ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత పాఠశాలలు, కళశాలలకూ ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news