ఈ నెల 19 నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌

-

తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేశారు. నుంచి ఈనెల 19 నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు. ఈ ప‌ర్య‌ట‌న వనపర్తి జిల్లా నుంచి మొదలు పెట్టనున్నారు. ఆదివారం వ‌నపర్తి జిల్లాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. వేరుశ‌న‌గ‌ పరిశోధన కేంద్రం, క‌ర్నె తండ ఎత్తిపోతల పథకం, సబ్ రిజిస్టర్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్, రెండు పడకల గదులు ప్రారంభించనున్నారు.

అనంత‌రం ఈ నెల 20న‌ సోమవారం జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టిస్తారు. జనగామలో కూడా ముఖ్య మంత్రి కేసీఆర్ ప‌లు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. తర్వాత నాగర్ కర్నూల్, జగిత్యాల, నిజామాబాద్, వికారాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు అయితే ప్ర‌జ‌ల్లో టిఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేక భావాన్ని తొలగించడానికి ముఖ్య మంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటనకు వస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత ముఖ్య మంత్రి కేసీఆర్ జిల్లా ల్లో పర్యటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news